వందశాతం ఉత్తీర్ణత సాధించాలి : డీఈవో
ABN , First Publish Date - 2022-01-25T05:59:02+05:30 IST
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని డీఈవో కె. అశోక్ అన్నారు.
సూర్యాపేట అర్బన్, జనవరి 24 : ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని డీఈవో కె. అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ నూతన క్యాలెండర్లు, డైరీలను సోమవారం ఆయన ఆవిష్కరించారు. పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. కార్యక్రమంలో ఏడీ శైలజ, శ్రావణ్, గులాబ్ జహంగీర్, సతీ్షకుమార్, వెంకట్రెడ్డి, బాలు, అజాం పాల్గొన్నారు.