వందశాతం ఉద్యోగాల కల్పనే ధ్యేయం
ABN , First Publish Date - 2022-05-20T05:47:30+05:30 IST
ట్రిపుల్ఐటీలో చదువుకున్న విద్యార్థులకు వందశాతం ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నామని ఇడుపులపాయ ట్రిపుల్ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి తెలిపారు.
వేంపల్లె, మే 19: ట్రిపుల్ఐటీలో చదువుకున్న విద్యార్థులకు వందశాతం ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నామని ఇడుపులపాయ ట్రిపుల్ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికి 81.87శాతం మం ది విద్యార్థులు పలు కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైనందున అభినందనసభ ఏర్పాటు చేశా రు. ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది జుపిటర్, ఇన్ఫోసిస్, టెస్, విప్రో, కాప్జెమిని, క్రెడిట్ విద్య, హెచ్సీఎల్, ఇన్నోమైండ్స్ కంపెనీలలో రూ.6లక్షల నుంచి రూ.24 లక్షల వేతనంతో ఉద్యోగాలు పొందారన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్తో పాటు ప్లేస్మెంట్ విభాగపు అధిపతి డాక్టర్ నాగరత్నకిషోర్, ఇతర అధ్యాపకులు అభినందించారు.