వందశాతం ఉద్యోగాల కల్పనే ధ్యేయం

ABN , First Publish Date - 2022-05-20T05:47:30+05:30 IST

ట్రిపుల్‌ఐటీలో చదువుకున్న విద్యార్థులకు వందశాతం ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నామని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ సంధ్యారాణి తెలిపారు.

వందశాతం ఉద్యోగాల కల్పనే ధ్యేయం
పలు కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులతో ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ సంధ్యారాణి, అధ్యాపకులు

వేంపల్లె, మే 19: ట్రిపుల్‌ఐటీలో చదువుకున్న విద్యార్థులకు వందశాతం ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నామని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ సంధ్యారాణి తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికి 81.87శాతం మం ది విద్యార్థులు పలు కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైనందున అభినందనసభ ఏర్పాటు చేశా రు. ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది జుపిటర్‌, ఇన్ఫోసిస్‌, టెస్‌, విప్రో, కాప్‌జెమిని, క్రెడిట్‌ విద్య, హెచ్‌సీఎల్‌, ఇన్నోమైండ్స్‌ కంపెనీలలో రూ.6లక్షల నుంచి రూ.24 లక్షల వేతనంతో ఉద్యోగాలు పొందారన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌తో పాటు ప్లేస్‌మెంట్‌ విభాగపు అధిపతి డాక్టర్‌ నాగరత్నకిషోర్‌, ఇతర అధ్యాపకులు అభినందించారు. 

Updated Date - 2022-05-20T05:47:30+05:30 IST