వందశాతం వ్యాక్సినేషన్పై దృష్టిపెట్టాలి
ABN , First Publish Date - 2021-10-26T04:36:49+05:30 IST
వందశాతం వ్యాక్సి నేషన్పై వైద్యసిబ్బంది ప్రత్యేక దృష్టిపెట్టాలని డీఎంహెచ్వో నాగరా జు సూచించారు.
ఎర్రగుంట్ల, అక్టోబరు 25: వందశాతం వ్యాక్సి నేషన్పై వైద్యసిబ్బంది ప్రత్యేక దృష్టిపెట్టాలని డీఎంహెచ్వో నాగరా జు సూచించారు. సో మవారం ఆయన ఎర్రగుంట్లలోని 6వ సచివాలయ పరిధిలో వ్యాక్సిన్ వేయించుకోని వారికి కౌ న్సెలింగ్ ఇచ్చి వారికి వ్యా క్సిన్ వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క రు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. వలంటీర్లద్వా రా వ్యాక్సినేషన్ సర్వే మరింత సమర్ధవంతంగా నిర్వహించాల ని పీహెచ్సీ వైద్యాధికారి కృష్ణచైతన్యను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కె.శివారెడ్డి, సూపర్వైజర్లు ఓబులేసు, వరదమ్మ, లక్ష్మీదేవ మ్మ, ఏఎన్ఎం అనిత, ఆశావర్కర్లు, డిజిటల్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు.