అన్నివర్గాలకు వంద శాతం విద్య అందించాలి
ABN , First Publish Date - 2022-08-19T04:51:58+05:30 IST
అన్ని వర్గాలకు వంద శాతం విద్య అందినప్పుడే
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 18: అన్ని వర్గాలకు వంద శాతం విద్య అందినప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యమని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి.మాణిక్రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నంలో టీఎస్ యూటీఎఫ్ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాములయ్య, నాయకులు వెంకటప్ప, నాగేంద్రం, కిసన్ చౌహాన్, సుగంధ పాల్గొన్నారు.