వాషిం జిల్లా హాస్టల్‌లో 190 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-02-25T15:43:15+05:30 IST

ఒక వైపు కరోనా నిరోధానికి వ్యాక్సిన్ అందిస్తున్నా, మరోవైపు కరోనా మహమ్మారి ప్రబలుతూనే ఉంది....

వాషిం జిల్లా హాస్టల్‌లో 190 మందికి కరోనా

ముంబై (మహారాష్ట్ర) : ఒక వైపు కరోనా నిరోధానికి వ్యాక్సిన్ అందిస్తున్నా, మరోవైపు కరోనా మహమ్మారి ప్రబలుతూనే ఉంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్రలోని వాషిం జిల్లా హాస్టల్ లో 190 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.విదర్భ ప్రాంతంలోని అమరావతి జిల్లాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.కరోనా వ్యాప్తి చెందుతున్న మహారాష్ట్రతోపాటు కేరళ, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు కేంద్ర అధికారుల బృందాలు వచ్చి కరోనా ప్రబలడానికి కారణాలపై అధ్యయనం చేస్తున్నాయి. మార్చి 1వతేదీ నుంచి 60 ఏళ్ల వయసు నిండిన వృద్ధులకు, 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి కరోనా రాకుండా వ్యాక్సిన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

Updated Date - 2021-02-25T15:43:15+05:30 IST