‘వంద రోజుల పని కల్పించాలి’

ABN , First Publish Date - 2022-06-22T05:14:29+05:30 IST

ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుంబానికీ వంద రోజుల పని కల్పించాలని సీపీఎం నాయకులు సీహెచ్‌ అమ్మన్నాయుడు, వెలమల రమణ డిమాండ్‌ చేశారు.

‘వంద రోజుల పని కల్పించాలి’
ఆందోళన చేస్తున్న సీపీఎం నాయకులు, వేతనదారులు:


రణస్థలం, జూన్‌ 21 : ఉపాధి హామీ పథకం కింద  ప్రతి కుటుంబానికీ వంద రోజుల పని కల్పించాలని  సీపీఎం నాయకులు సీహెచ్‌ అమ్మన్నాయుడు, వెలమల రమణ డిమాండ్‌ చేశారు. మంగళవారం నగరప్పాలెం సచివాలయం ఎదురుగా వేతనదారులతో కలసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరప్పాలెం గ్రామంలో రోడ్లు, కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే వీటిని నిర్మించాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 




Updated Date - 2022-06-22T05:14:29+05:30 IST