చికిత్స పొందుతూ ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-05-18T05:34:08+05:30 IST

బొమ్మనకాడి గౌరవ్వ (58) అనే మహిళ చికిత్స పొందుతూ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో మృతి చెందిందని ఎస్సై రాజారెడ్డి తెలిపారు. బోధన్‌ మండలం పెగడాపల్లికి చెందిన బోబాబాయ్‌ గౌరవ్వ అనే ఇద్దరు భార్యభర్తలు ఈనెల 14న మండలంలోని ధర్మారంలో జరిగే ఓ శుభకార్యనికి మోపెడ్‌ వాహనంపై వచ్చారని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం తమ స్వగ్రామానికి వారు వెళుతుండగా మండలంలోని ధర్మారం రోడ్డు మూలమలుపు వద్ద వెనుక నుంచి వచ్చిన కారు మోపెడ్‌ వాహనాన్ని ఢీకొట్టిందని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో బోబాబాయ్‌ గౌరవ్వలకు తీవ్ర గాయాలు కాగా వెంటనే వారిని 108లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించడం జరిగిందని, అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గౌరవ్వ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ బోబాబాయ్‌ ప్రస్తుతం కోలుకున్నాడని ఎస్సై తెలిపారు. మృతురాలి కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ ఒకరి మృతి

నవీపేట, ఏప్రిల్‌ 17 : బొమ్మనకాడి గౌరవ్వ (58) అనే మహిళ చికిత్స పొందుతూ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో మృతి చెందిందని ఎస్సై రాజారెడ్డి తెలిపారు. బోధన్‌ మండలం పెగడాపల్లికి చెందిన బోబాబాయ్‌ గౌరవ్వ అనే ఇద్దరు భార్యభర్తలు ఈనెల 14న మండలంలోని ధర్మారంలో జరిగే ఓ శుభకార్యనికి మోపెడ్‌ వాహనంపై వచ్చారని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం తమ స్వగ్రామానికి వారు వెళుతుండగా మండలంలోని ధర్మారం రోడ్డు మూలమలుపు వద్ద వెనుక నుంచి వచ్చిన కారు మోపెడ్‌ వాహనాన్ని ఢీకొట్టిందని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో బోబాబాయ్‌ గౌరవ్వలకు తీవ్ర గాయాలు కాగా వెంటనే వారిని 108లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించడం జరిగిందని, అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గౌరవ్వ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ బోబాబాయ్‌ ప్రస్తుతం కోలుకున్నాడని ఎస్సై తెలిపారు. మృతురాలి కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Updated Date - 2022-05-18T05:34:08+05:30 IST