బైక్ల ఢీ: ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-02-27T04:39:57+05:30 IST
రెండు బైక్లు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు
ముగ్గురికి గాయాలు
చిట్టమూరు, ఫిబ్రవరి 26 : రెండు బైక్లు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తాడి మేడు రోడ్డు సమీపంలో శుక్ర వారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నా యి. తాడిమేడు గ్రామానికి చెం దిన బెజవాడ సుధ, తన భార్య మల్లీశ్వరి(35) వైద్యం చేయించు కునేందుకు బైక్పై కొత్తగుంటకు వెళ్లారు. పని పూర్తయిన అనంత రం తిరిగి వెళుతుండగా దొరవారిసత్రం మండలం కటాపల్లికి చెందిన మస్తానమ్మ తన సోదరుడు ఈశ్వర్తో కలసి బైక్పై వాకాడు గొల్లపాళెం వెళుతూ తాడిమేడు సమీపంలో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో మళ్లీశ్వరి తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సుధ తీవ్రంగా గాయపడ్డాడు. మస్తానమ్మ, ఈశ్వర్కు గాయాలయ్యాయి. ఎస్ఐ కిషోర్బాబు, హెడ్ కానిస్టేబుల్ రఫీ సంఘటనా స్థలికి చేరుకున్నారు. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ఎస్ఐ తన జీపులో క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మళ్లీశ్వరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.