లారీ టైరు మారుస్తుండగా..

ABN , First Publish Date - 2021-07-25T06:14:26+05:30 IST

ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొన్న ప్రమాదంలో క్లీనర్‌ మృతి చెందిన ఘటన పెదతాడేపల్లిలో శనివారం చోటు చేసుకుంది.

లారీ టైరు మారుస్తుండగా..

తాడేపల్లిగూడెం రూరల్‌, జూలై 24: ఆగి ఉన్న లారీని మరో లారీ  ఢీకొన్న ప్రమాదంలో క్లీనర్‌ మృతి చెందిన ఘటన పెదతాడేపల్లిలో శనివారం చోటు చేసుకుంది. రూరల్‌ పోలీసుల వివరాల ప్రకారం పెదతాడేపల్లి జాతీయ రహదారి వద్ద ఏలూరు నుంచి తణుకు వైపు వెళ్తున్న లారీకి టైర్‌ పంక్చరైంది. దీంతో డ్రైవర్‌ పరదేశ్‌కుమార్‌, క్లీనర్‌ జోసెఫ్‌కుమార్‌ సింగ్‌  టైరు మార్చేందుకు లారీ కిందకు వెళ్లారు. ఆ సమయంలో  మరో లారీ ఆగి ఉన్న వీరి లారీని ఢీకొట్టడంతో డ్రైవర్‌, క్లీనర్‌లపై నుంచి లారీ దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడిన వీరిని హైవే అంబులెన్స్‌లో తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించ గా అక్కడ చికిత్స పొందుతూ క్లీనర్‌ జోసెఫ్‌ కుమార్‌ సింగ్‌ (20) మృతి చెందాడు.   కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. 


Updated Date - 2021-07-25T06:14:26+05:30 IST