రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ABN , First Publish Date - 2022-01-25T06:00:21+05:30 IST

అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారిపై మండలంలోని లెప్రసీ కాలనీ సమీపాన ఆదివారం రాత్రి ఓమినీ వాహనాన్ని లారీ ఢీ కొన్న ప్రమాదంలో హుస్సేన(31) అనే వ్యక్తి మృతిచెందగా... మౌలా కు గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ప్రమాదంలో మృతిచెందిన హుస్సేన

కూడేరు, జనవరి24: అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారిపై మండలంలోని లెప్రసీ కాలనీ సమీపాన ఆదివారం రాత్రి ఓమినీ వాహనాన్ని లారీ ఢీ కొన్న ప్రమాదంలో హుస్సేన(31) అనే వ్యక్తి మృతిచెందగా... మౌలా కు గాయాలయ్యాయి. పోలీసులు అందించిన వివరాల మేరకు.. బుక్కరాయసముద్రానికి చెందిన హుస్సేన, మౌలా పశువులు వ్యా పారులు. ఈ నేపథ్యంలో ఓమినీ కారులో అనంతపురం వై పు నుం చి బళ్లారికి బయల్దేరారు. లెప్రసీ కాలనీ వద్దకు రాగానే... ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో హుస్సేన అక్కడికక్కడే మృతి చెందగా.. మౌలాకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టంకి, మౌలాను ఆస్పత్రికి తలరించారు. హుస్సేన భార్య ఫాతిమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ వసీం అక్రమ్‌ తెలిపారు.


Updated Date - 2022-01-25T06:00:21+05:30 IST