రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ABN , First Publish Date - 2021-05-14T07:11:59+05:30 IST
మండల పరిధిలోని సువెన్ ఫ్యాక్టరీ సమీ పంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధిహమీ పథకం ఉద్యోగి మృతిచెందాడు.
సూర్యాపేటరూరల్, మే 13: మండల పరిధిలోని సువెన్ ఫ్యాక్టరీ సమీ పంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధిహమీ పథకం ఉద్యోగి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట పట్టణానికి చెందిన పొట్టపింజర వెంకటేశ్వర్లు(43) ఉపాధిహమీ పథకం విభా గంలో టెక్నికల్ అసిస్టెంట్గా చివ్వెంల మండలంలో పనిచేస్తున్నాడు. డ్యూటీ నిమిత్తం బైక్పై వట్టిఖమ్మంపహాడ్ గ్రామానికి వెళ్లి తిరిగి సూ ర్యాపేటకు వస్తున్న క్రమంలో సువెన్ ఫ్యాక్టరీ సమీపంలో గేదె అడ్డురావడంతో తప్పించబోయి బైక్ అదుపుతప్పడంతో వెంకటేశ్వర్లు కిందపడి తల కు తీవ్రగాయాలయ్యాయి. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిం చారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటేశ్వర్లుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుని తమ్ముడు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లవకుమార్ తెలిపారు.