లారీ ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-01-25T05:23:18+05:30 IST
లారీ ఢీకొని వ్యక్తి మృతి
తొర్రూరు, జనవరి 24 : లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని మాటేడు గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు, అదనపు ఎస్సై మునీరుల్లా వివరాల మేరకు.. మాటేడుకు చెందిన మహంకాళి శంకర్(22) మెయిన్ రోడ్డు దాటుతుండగా ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తున్న గ్రానైట్ లారీ ఢీకొట్టింది. వెనక టైర్ల కిందపడిన శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. శంకర్కు భార్య ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.