Friends తో కలిసి సిట్టింగ్.. బీర్లు కొని ఖాళీ స్థలంలో కూర్చొని తాగుతుండగా.. ఇంతలో పోలీస్ సైరన్.. ఒక్కసారిగా..!

ABN , First Publish Date - 2021-11-02T12:57:30+05:30 IST

స్నేహితులతో కలిసి సరదాగా రాత్రి బయటకు వచ్చిన ఓ యువకుడికి...

Friends తో కలిసి సిట్టింగ్.. బీర్లు కొని ఖాళీ స్థలంలో కూర్చొని తాగుతుండగా.. ఇంతలో పోలీస్ సైరన్.. ఒక్కసారిగా..!

కరీంనగర్/జమ్మికుంట : స్నేహితులతో కలిసి సరదాగా రాత్రి బయటకు వచ్చిన ఓ యువకుడికి పోలీస్‌సైరన్‌ యమపాశంగా మారింది. జమ్మికుంట పట్టణంలోని మోత్కుల గూడెంకు చెందిన పొనగంటి వేణు(37) ఓ ప్రైవేట్‌ మహిళా డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి ముగ్గురు స్నేహితు లతో కలిసి సరదాగా జమ్మికుంట పట్టణంలోని హుజూరాబాద్‌ రోడ్డు వైపు వచ్చారు. అక్కడే ఉన్న అభిరామ్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో బీర్లు కొనుగోలు చేశారు. రెస్టారెంట్‌ ఎదురుగా ఉన్న ఖాళీ ఫ్లాట్‌ సమీపంలో బీర్లు తాగారు.


అదే సమయంలో సైరన్‌ వేసుకుని పోలీసు వాహనం అటువైపుగా వచ్చింది. కంగారు పడ్డవారు తలో దిక్కు పరుగులు పెట్టారు. వేణు మాత్రం ఖాళీ ఫ్లాట్‌ వైపు పురుగులు పెట్టగా, అక్కడే ఉన్న వ్యవసాయ బావిలో జారి పడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని కాపాడేందుకు బావిలో దూకి తీవ్ర ప్రయత్నాలు చేశారు. వేణుకు ఈత రాకపోవడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. రాత్రి 1 గంట సమయంలో మృతదేహం వెలికి తీశారు. ఇదిలా ఉండగా వేణు బహిర్భూమి కోసం అటు వైపు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడని మృతుడి భార్య స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ తిరుమల్‌గౌడ్‌ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

Updated Date - 2021-11-02T12:57:30+05:30 IST