విశాఖ ఘటన : ఘటనాస్థలిలో మృతదేహం లభ్యం!

ABN , First Publish Date - 2020-07-14T14:37:11+05:30 IST

విశాఖపట్నం : జిల్లాలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీలో సోమవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

విశాఖ ఘటన : ఘటనాస్థలిలో మృతదేహం లభ్యం!

విశాఖపట్నం : జిల్లాలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీలో సోమవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల ప్రాంతంలో సాల్వెంట్ ప్లాంట్‌లో జరిగిన ఈ భారీ పేలుడుతో వైజాగ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయని.. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే తాజాగా ఘటనాస్థలంలో ఒకరి మృతదేహం లభ్యమైందని తెలుస్తోంది. మృతదేహం శిధిలాల కింద ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారులు ఇంకా దృవీకరించాల్సి ఉంది. కాగా.. అసలు ప్రమాదం జరిగినప్పుడు ఎంత మంది విధుల్లో ఉన్నారు..? ఎంత మంది ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారు..? అనే విషయాలు ఇంతవరకూ తెలియరాలేదు. 


అయితే అనకాపల్లి నుంచి ప్లాంట్‌లోకి విధులకు వచ్చిన వ్యక్తి కనిపించట్లేదని బంధువులు, కుటుంబీకులు రాత్రి నుంచి వెతుకుతున్నారు. ప్లాంట్‌లో మృతదేహం లభ్యం అయినట్లు వస్తున్న వార్తలతో వారిలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం నలుగురు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-07-14T14:37:11+05:30 IST