కేరళలో భవనం కూలి ఒకరి దుర్మరణం

ABN , First Publish Date - 2020-10-23T10:30:53+05:30 IST

భవనం కుప్పకూలిన ప్రమాద ఘటనలో ఓ వ్యక్తి మరణించిన ఘటన...

కేరళలో భవనం కూలి ఒకరి దుర్మరణం

కోజికోడ్ (కేరళ): భవనం కుప్పకూలిన ప్రమాద ఘటనలో ఓ వ్యక్తి మరణించిన ఘటన కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ నగరంలో వెలుగుచూసింది. కోజికోడ్ నగరంలోని కన్నన్ చెరి ప్రాంతంలో రెండు  అంతస్తుల భవనం గురువారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో భవనంలో ఉన్న రామచంద్రన్ (64) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన రామచంద్రన్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. జిల్లా కలెక్టరు సాంబశివరావు సంఘటన స్థలానికి వచ్చి శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. మృతుడు కూలిన భవనంలో ఫ్యాన్సీ ఆభరణాల గోదాం ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-10-23T10:30:53+05:30 IST