కారు ఢీ కొని మోటర్‌ సైక్లిస్టు దుర్మరణం

ABN , First Publish Date - 2021-04-16T05:43:24+05:30 IST

జాతీయ రహదారిలో వెంకటాపురం వద్ద రోడ్డు దాటుతున్న మోటర్‌ సైకిల్‌ను కారు ఢీ కొన్న సంఘటనలో మోటర్‌ సైకి లిస్ట్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

కారు ఢీ కొని మోటర్‌ సైక్లిస్టు దుర్మరణం
ప్రమాదంలో దగ్ధమవుతున్న కారు

మేదరమెట్ల, ఏప్రిల్‌ 15: జాతీయ రహదారిలో వెంకటాపురం వద్ద రోడ్డు దాటుతున్న మోటర్‌ సైకిల్‌ను కారు ఢీ కొన్న సంఘటనలో మోటర్‌ సైకి లిస్ట్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటాపురం గ్రామానికి చెందిన గుడి మిట్ల దినకర్‌ (22) గ్రోత్‌ సెంటర్‌లో ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. గురువారం ఉదయం దినకర్‌ మోటర్‌ సైకిల్‌పై విధులకు బయలు దేరా డు. హైవే రాడ్డు దాటుతున్న క్రమంలో విజయవాడ నుండి నెల్లూరుకు కారులో వెళ్తున్న చందలూరి హరిబాబు మోటర్‌ సైకిల్‌ను ఢీ కొనడంతో దినకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్దిదూరం వెళ్లిన కారులో పొగలు రావడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వెంటనే దిగగా, కారు దగ్ధం అయింది. అద్దంకి పైర్‌ సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మృతుడి  తల్లి నాగేంద్రమ్మ పిర్యాదు మేరకు  మేదరమెట్ల ఎస్‌ఐ కట్టా అనూక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. 

Updated Date - 2021-04-16T05:43:24+05:30 IST