ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

ABN , First Publish Date - 2022-06-28T21:34:10+05:30 IST

హైదరాబాద్: కమిషనర్ లోకేష్ కుమార్ జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదకర నాలాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఇటీవల ఇంజనీర్లను కమిషనర్

ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

హైదరాబాద్: కమిషనర్ లోకేష్ కుమార్  జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదకర నాలాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఇటీవల ఇంజనీర్లను కమిషనర్ ఆదేశించారు. అయితే ఆయన ఆదేశాలను వారు పాటించలేదు. కమిషనర్ ఆకస్మిక తనిఖీల్లో ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. దీంతో 38 మంది ఇంజనీర్లపై ఆగ్రహించిన కమిషనర్  వారి ఒకరోజు వేతనాన్ని కట్ చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘ఇంజనీర్ల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తామం. నాలాలపై జాగ్రత్తలు తీసుకోని బాధ్యులందరిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. భవిష్యత్తులో పునరావృతమైతే, ఎలాంటి నోటీసు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.’’ అని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ హెచ్చరించారు.

 

Updated Date - 2022-06-28T21:34:10+05:30 IST