శ్రీనగర్‌లో తీవ్రవాద దాడి.. సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి

ABN , First Publish Date - 2022-04-04T23:49:35+05:30 IST

శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్‌లపై తీవ్రవాదులు కాల్పులు జరపడంతో్ ఒక జవాను మృతిచెందాడు. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి.

శ్రీనగర్‌లో తీవ్రవాద దాడి.. సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి

శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్‌లపై తీవ్రవాదులు కాల్పులు జరపడంతో్ ఒక జవాను మృతిచెందాడు. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో ఉన్న మైసుమాలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఇద్దరు జవాన్‌లపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు అక్కడే రోడ్డుపై కూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని జవాన్లను ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన ఒక జవాను మరణించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దగ్గర్లోని మరో ప్రాంతంలో కూడా సామాన్యులపై తీవ్రవాదులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. శ్రీనగర్‌లోని మైసుమా ప్రాంతం జనసంచారంతో చాలా రద్దీగా ఉంటుంది. మరోవైపు దగ్గర్లో చెక్‌పోస్టులు కూడా ఉంటాయి. అయినప్పటికీ, కాల్పుల ఘటన జరగడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని, తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-04-04T23:49:35+05:30 IST