ఒక్క ఛాన్స అన్నాడు.. అందర్నీ ముంచాడు
ABN , First Publish Date - 2022-05-24T05:47:06+05:30 IST
ఒక్క ఛాన్స ఇస్తే చాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పఽథంలో నడిపిస్తానని నమ్మించి అధికారం రాగానే అందర్నీ ముంచేస్తున్నాడని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ధ్వజ మెత్తారు.
ప్రజా చైతన్య యాత్రలో పుత్తా నరసింహారెడ్డి ధ్వజం
కమలాపురం రూరల్, మే 23 : ఒక్క ఛాన్స ఇస్తే చాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పఽథంలో నడిపిస్తానని నమ్మించి అధికారం రాగానే అందర్నీ ముంచేస్తున్నాడని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ధ్వజ మెత్తారు. సోమవారం మండల పరిఽధిలోని పెద్ద చెప్పలి గ్రామంలో ప్ర జా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నిత్యావసర సరుకులతో పాటు డీజల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. తెలుగుదేశం పాలనలో పెట్టిన సంక్షేమ పథకాలే తప్ప కొత్తగా చేసిందేమీ లేదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలన్నారు. అనంతరం టీడీపీ వాణిజ్య విభాగాల రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికైన శీలం ప్రభాకర్రెడ్డిని ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖాదర్బాషా, యల్లారెడ్డి, రాఘవరెడ్డి, నరసింహులు, ఇంద్రసేనారెడ్డి, దాదిరామయ్య, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.