ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు ఏఎస్ఐకు కరోనా వైరస్
ABN , First Publish Date - 2020-04-08T14:38:49+05:30 IST
ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరుకు కరోనా వైరస్ సోకింది.....
ఎయిమ్స్కు తరలింపు
ఢిల్లీ : ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరుకు కరోనా వైరస్ సోకింది. ఢిల్లీ నగరంలోని రోడ్లపై విధులు నిర్వర్తించిన ట్రాఫిక్ పోలీసు ఏఎస్ఐకు కరోనా పాజిటివ్ అని రిపోర్టు రావడంతో అతన్ని వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జ్వరంతో బాధపడుతున్న ఏఎస్ఐను అనుమానంతో పరీక్షించగా కరోనా సోకిందని తేలింది.దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ ఏఎస్ఐ కుటుంబసభ్యులను హోంక్వారంటైన్ చేశారు. ఏఎస్ఐ నివాసముంటున్న కాలనీతోపాటు అతను పనిచేసిన ప్రాంతాన్ని పోలీసులు లాక్ డౌన్ చేశారు. ఏఎస్ఐ ఎవరెవరిని కలిశారో పోలీసులు ఆరా తీస్తున్నారు.