ఏడాదిన్నర... రూపాయి... 104 పైసలు పతనం...

ABN , First Publish Date - 2021-02-27T01:47:17+05:30 IST

డాలర్ మారకంతో రూపాయి విలువ భారీగా పడిపోయింది. గత ఒకటిన్నర సంవత్సర కాలంలో రూపాయి... తొలిసారి ఇంత దారుణంగా పతనమైంది. ఈ రోజు... భారత రూపాయితో పాటు ఈక్విటీ మార్కెట్ కూడా దారుణంగా పతనమైంది.

ఏడాదిన్నర... రూపాయి... 104 పైసలు పతనం...

ముంబై : డాలర్ మారకంతో రూపాయి విలువ భారీగా పడిపోయింది. గత ఒకటిన్నర సంవత్సర కాలంలో రూపాయి... తొలిసారి ఇంత దారుణంగా పతనమైంది. ఈ రోజు... భారత రూపాయితో పాటు ఈక్విటీ మార్కెట్ కూడా దారుణంగా పతనమైంది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ఉండటంతో ఆ ప్రభావం దేశీయ ఈక్విటీ మార్కెట్లపై పడింది. దీంతో సెన్సెక్స్ ఈ రోజు 1,939 పాయింట్లు లేదా 3.80 శాతం నష్టపోయి 49,099.99 వద్ద, నిఫ్టీ 568 పాయింట్లు లేదా 3.76 శాతం నష్టపోయి 14,529.15 పాయింట్ల వద్ద ముగిశాయి. డొమెస్టిక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో రూపాయి కూడా పతనమైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 


ఇక డాలర్ మారకంతో రూపాయి 104 పైసలు క్షీణించి 73.47 వద్ద ముగిసింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తడం, ఓవర్సీస్ మార్కెట్‌లో అమెరికన్ కరెన్సీ బలంగా ఉండటంతో రూపాయి పతనమైంది. కాగా... గడిచిన 19 నెలల రాలంలె రూపాయికి ఇది దారుణమైన పతనం. ప్రారంభం నుండి రూపాయి బలహీనంగానే కదలాడింది. గురువారం రూపాయి 72.43 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. 


స్టాక్ మార్కెట్లు కూడా నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,939 పాయింట్లు నష్టపోగా, నిఫ్ట్ 14,430 పాయింట్ల దిగువన ముగిసింది. క్రితం సెషన్లో 51 వేలకు పైగా ఉన్న సెన్సెక్స్ ఏకంగా 49 వేల పాయింట్లకు పడిపోయింది. 

Updated Date - 2021-02-27T01:47:17+05:30 IST