అసాంఘిక కార్యకలాపాలపై... పోలీసుల మెరుపుదాడులు
ABN , First Publish Date - 2022-01-28T05:56:36+05:30 IST
వనటౌన పో లీసులు బృందాలుగా ఏర్పడి నగరంలో అసాంఘిక కార్య కలాపాలపై మెరుపుదాడులు చేశారు.
అనంతపురం క్రైం, జనవరి 27 : వనటౌన పో లీసులు బృందాలుగా ఏర్పడి నగరంలో అసాంఘిక కార్య కలాపాలపై మెరుపుదాడులు చేశారు. ఇందుకు సంబం ధించి సీఐ రవిశంకర్రెడ్డి ఎస్ఐ గౌస్బాష తదితర సి బ్బందితో కలిసి వివరాలను వెల్లడించారు. హిందూపు రం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి గురువారం నగరంలోని వేణుగోపాల్నగర్లో గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తుం డగా.. ఆకస్మిక దాడులు చేసి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 10 వేలు విలువ చేసు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నగరంలోని ఆర్వీ నగర్ కు చెందిన ఓ మహిళ తమ కాలనీలోని కాలువ వద్ద నా టుసారా విక్రయిస్తుండగా.. ఆకస్మిక దాడులు చేసి రూ. 3.5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ఆమెను అ రెస్ట్ చేశారు. వీటితో పాటు నగర శివారులోని టీవీటవర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నగరంలోని భైరవనగర్ లోని ప్రజల నుంచి పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా ఆటోలో తరలిస్తుం డగా.. ఆకస్మిక దాడులు చేసి గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి ఆటోతో పాటు 13 బ్యాగుల పీడీఎస్ బియ్యం స్వా ధీనం చేసుకున్నారు. అలాగే నగరంలోని శ్రీకంఠం సర్కిల్ సమీపంలోని సీవీ ఆర్ లాడ్జిలో పేకాడుతున్న 16మందిని అరెస్ట్ చేసి రూ. 9310 నగదును స్వాదీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.