రేపటి నుంచి స్పందన

ABN , First Publish Date - 2021-07-25T06:00:12+05:30 IST

కొవిడ్‌ కారణంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిలిచిపోయిన స్పందన కార్యక్రమంలో సోమవారం నుంచి ఫునఃప్రారంభం కానుంది.

రేపటి నుంచి స్పందన
స్పందన నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

  గతేడాది మార్చి 16న చివరగా నిర్వహణ

  ఆపై కొవిడ్‌ కారణంగా రద్దు

చిత్తూరు (సెంట్రల్‌), జూలై 24: కొవిడ్‌ కారణంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిలిచిపోయిన స్పందన కార్యక్రమంలో సోమవారం నుంచి ఫునఃప్రారంభం కానుంది. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు వేదికైన స్పందన ప్రజలకు మేలు జరిగేలా ఉండాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లను జేసీ వీరబ్రహ్మంతో కలిసి పరిశీలించి, డీఆర్వో మురళికి పలు సూచనలు చేశారు.  ఇదిలా ఉండగా గతేడాది మార్చి 16న చివరి స్పందన కార్యక్రమం జరిగింది. ఈ తర్వాత కొవిడ్‌ నేపధ్యంలో మార్చి 22న భారత్‌ బంద్‌ ప్రకటించడం, 23న సోమవారం స్పందన రద్దు కావడం జరిగింది. జూలైలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సోమవారం ఉదయం 10 గంటల నుంచి  కలెక్టర్‌ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించేందుకు సంబంధిత అథికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-25T06:00:12+05:30 IST