ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. రెండో రోజే ఊహించని షాకిచ్చాడు.. పోలీసులను ఆశ్రయించిన కొత్త పెళ్లి కూతురు..

ABN , First Publish Date - 2022-04-14T17:43:09+05:30 IST

ఆమె తన తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకుంది.. ఇంటి నుంచి పారిపోయి ప్రియుడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది..

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. రెండో రోజే ఊహించని షాకిచ్చాడు.. పోలీసులను ఆశ్రయించిన కొత్త పెళ్లి కూతురు..

ఆమె తన తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకుంది.. ఇంటి నుంచి పారిపోయి ప్రియుడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది.. ఆ పెళ్లికి యువకుడి స్నేహితులు చాలా సహాయం చేశారు.. అందుకు కృతజ్ఞతగా ఆ యువకుడు తన భార్యనే వారికి ఇచ్చాడు.. పెళ్లికి సహకరించిన తన స్నేహితులకు శారీరక సుఖం అందించాలని భార్యను అడిగాడు.. దాంతో ఆ యువకుడి స్నేహితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఆ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 19 ఏళ్ల యువతి ఛోటేలాల్ (అసలు పేరు కాదు) అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇంటి నుంచి పారిపోయి ఈ నెల 9వ తేదీన అతడిని వివాహం చేసుకుంది. ఆ పెళ్లికి ఛోటేలాల్ స్నేహితులు ఆనంద్, దీపక్ సహాయం చేశారు. పెళ్లి జరిగిన తర్వాతి రోజు ఆ ముగ్గురూ ఇంట్లోనే ఆల్కహాల్ సేవించారు. మద్యం మత్తులో ఛోటేలాల్ తన భార్యకు షాకిచ్చాడు. పెళ్లికి సహాయం చేసిన తన స్నేహితులకు శారీరక సుఖం అందించాలని భార్యను అడిగాడు. 


ఛోటేలాల్ పర్మిషన్ ఇవ్వడంతో దీపక్, ఆనంద్ ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. తర్వాతి రోజు ఆ యువతి ఆనంద్ నగర్ పోలీసులను ఆశ్రయించి భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఛోటేలాల్, ఆనంద్, దీపక్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-04-14T17:43:09+05:30 IST