డీఎంకే నిర్బంధించడం లేదు: జవహిరుల్లా

ABN , First Publish Date - 2021-01-25T11:39:01+05:30 IST

ఉదయ సూర్యుడు గుర్తుపై పోటీచేయాలని డీఎంకే తమను నిర్బంధించలేదని, ఈ విషయమై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మణిదనేయ...

డీఎంకే నిర్బంధించడం లేదు:  జవహిరుల్లా

చెన్నై/వాషర్‌మెన్‌పేట (ఆంధ్రజ్యోతి): ఉదయ సూర్యుడు గుర్తుపై పోటీచేయాలని డీఎంకే తమను నిర్బంధించలేదని, ఈ విషయమై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మణిదనేయ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు జవహిరుల్లా స్పష్టం చేశారు. తిరునల్వేలిలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఇటీవల ముఖ్యమంత్రి పళనిస్వామి ముస్లిం జమాత్‌ అధ్యక్షులను కలుసుకొని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఓట్లు అభ్యర్ధించారన్నారు. ఓట్ల కోసం దిగజారిన సీఎంను చూస్తుంటే హాస్యంగా ఉందని, ఓటమి భయంతోనే అన్నాడీఎంకే నేతలు కులమతాల పార్టీల వెనుక నడుస్తున్నార న్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘనవిజయం సాధిస్తుందని ఆయన జోస్యం పలికారు. 2009 నుంచి తాము ప్రత్యేక గుర్తుతో పోటీచేస్తున్నామని, అదే విధంగా రానున్న ఎన్నికల్లో కూడా పోటీచేస్తామని జవహిరుల్లా తెలిపారు.

Updated Date - 2021-01-25T11:39:01+05:30 IST