విడాకులు తీసుకున్న మహిళను ట్రాప్ చేసిన కానిస్టేబుల్.. పెళ్లి చేసుకుంటానంటూ అత్యాచారం.. డబ్బులు కూడా తీసుకుని, చివరకు..

ABN , First Publish Date - 2022-02-10T16:04:28+05:30 IST

అతను ఓ హెడ్ కానిస్టేబుల్.. విడాకులు తీసుకుని పదేళ్ల కొడుకుతో నివసిస్తున్న మహిళతో పరిచయం పెంచుకున్నాడు..

విడాకులు తీసుకున్న మహిళను ట్రాప్ చేసిన కానిస్టేబుల్.. పెళ్లి చేసుకుంటానంటూ అత్యాచారం.. డబ్బులు కూడా తీసుకుని, చివరకు..

అతను ఓ హెడ్ కానిస్టేబుల్.. విడాకులు తీసుకుని పదేళ్ల కొడుకుతో నివసిస్తున్న మహిళతో పరిచయం పెంచుకున్నాడు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. తరచుగా ఆమె ఇంటికి వెళ్లేవాడు.. అవసరం ఉందని చెప్పి పలుసార్లు ఆమె నుంచి డబ్బులు తీసుకున్నాడు.. అతని కోసం ఆమె స్వంత ఇంటిని కూడా అమ్మేసింది.. చివరకు అతని నిజ స్వరూపం బయటపడడంతో పోలీసులను ఆశ్రయించింది. 


హర్యానాలోని పానిపట్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ సందీప్ కొన్ని రోజుల క్రితం కోర్టులో బాధిత మహిళను కలిశాడు. ఆమె నెంబర్ తీసుకుని తరచుగా ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఆ పరిచయంతో ఇంటికి కూడా వెళ్లేవాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఫలితంగా ఆ మహిళ గర్భం దాలిస్తే అబార్షన్ కూడా చేయించాడు. తన అవసరాల కోసం ఆమె నుంచి తరచుగా డబ్బులు తీసుకునేవాడు. 


అతనికి డబ్బులు ఇవ్వడం కోసమని బాధిత మహిళ తన ఇంటిని కూడా అమ్మేసింది. అనంతరం పెళ్లి చేసుకొమ్మని అడిగితే సందీప్ మొహం చాటేశాడు. బెదిరింపులకు దిగాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించి సందీప్‌పై అత్యాచారం కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సందీప్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

Updated Date - 2022-02-10T16:04:28+05:30 IST