19న చలో కలెక్టరేట్
ABN , First Publish Date - 2021-04-17T05:02:15+05:30 IST
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఈనెల 19న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వ హించనున్నట్లు సీపీఐ మండల కార్యదర్శి మనోహర్బాబు, మండల అధ్యక్షుడు నాగసుబ్బరాయుడులు తెలిపారు.
కొండాపురం, ఏప్రిల్ 16: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఈనెల 19న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వ హించనున్నట్లు సీపీఐ మండల కార్యదర్శి మనోహర్బాబు, మండల అధ్యక్షుడు నాగసుబ్బరాయుడులు తెలిపారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని, బిల్లులు ప్రతినెల విడుదల చే యాలని తదితర డిమాండ్లతో ఈ కార్యక్రమం నిర్వహిస్తు న్నట్లు వారు శుక్రవారం తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఐ, ఎమ్మా ర్పీఎస్ నాయకులు రామయ్య, శివశంకర్ పాల్గొన్నారు.