14న మాదిగ విద్యార్థుల చలో ఢిల్లీ

ABN , First Publish Date - 2021-12-05T05:18:02+05:30 IST

ఎస్సీ వర్గీకరణ సాధించే దిశలో ఈనెల 14న మాదిగ విద్యార్థుల చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్‌ నాయకులు తెలిపారు. శనివారం స్థానిక మాదిగ వీధిలో ప్లెక్సీని ప్రదర్శించారు.

14న మాదిగ విద్యార్థుల చలో ఢిల్లీ
ప్లెక్సీని విడుదల చేస్తున్న నాయకులు

రాజాం: ఎస్సీ వర్గీకరణ సాధించే దిశలో ఈనెల 14న మాదిగ విద్యార్థుల చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్‌ నాయకులు తెలిపారు. శనివారం స్థానిక మాదిగ వీధిలో ప్లెక్సీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోక్‌సభ శీతాకాల సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మాదిగ విద్యార్థులంతా పాల్గొని విజయవంతం చేయాలనికోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నాయకులు వై.బుజ్జి. రవికుమార్‌, పి.లాజర్‌, వై.చినబాబు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-05T05:18:02+05:30 IST