మధ్యంతర వాణిజ్య ఒప్పందం... మార్చి 11 న సంతకాలు చేయనున్న భారత్, ఆస్ట్రేలియా...
ABN , First Publish Date - 2022-02-22T00:08:58+05:30 IST
జౌళి, ఫార్మా, ఆరోగ్యం, పాదరక్షలు మొదలైన కీలక రంగాల్లో సుంకాలను తగ్గించేందుకు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఓ ఒప్పందం కుదిరింది. మార్చి 11 న పరిమిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్టీఏ) ఖరారు చేయనున్నాయి.
న్యూఢిల్లీ : జౌళి, ఫార్మా, ఆరోగ్యం, పాదరక్షలు మొదలైన కీలక రంగాల్లో సుంకాలను తగ్గించేందుకు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఓ ఒప్పందం కుదిరింది. మార్చి 11 న పరిమిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్టీఏ) ఖరారు చేయనున్నాయి. ‘మేం మార్చి 11 న ఆస్ట్రేలియాతో మధ్యంతర ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నాంచ దాని తర్వాత 2023 లో తుది ఒప్పందంపై దృష్టి సారిస్తాం. మేం ఏప్రిల్లో బ్రిటన్తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తాం’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియా వాణిజ్యంలో 75 శాతం ఎఫ్టీఏల పరిధిలోకి వస్తుంది, అయితే... ఈ కొత్త ఒప్పందంతో ఈ శాతం 90 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. సమగ్ర వాణిజ్య ఒప్పందం ముగియడానికి ముందు రెండు దేశాలు, లేదా... ట్రేడింగ్ బ్లాక్ల మధ్య సంబంధిత వ్యాపారంపై సుంకాలను సరళీకరించడానికి మధ్యంతర, లేదా... ముందస్తు పంట వాణిజ్య ఒప్పందం ఉపయోగించబడుతుంది. ఇరు దేశాలు 12-18 నెలల్లో సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని(సీఈసీఏ) పరిశీలించనున్నాయి. మధ్యంతర ఒప్పందాన్ని ముప్ఫై రోజుల్లోగా ప్రకటించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.