10వ తేదీ 10 గంటలకు ఈ సాంగ్ ప్లే అవుతుంది..
ABN , First Publish Date - 2022-03-04T20:26:04+05:30 IST
జేపీని ఉత్తరప్రదేశ్ నుంచి సాగనంపడం ఖాయమైందని సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు..
లక్నో: బీజేపీని ఉత్తరప్రదేశ్ నుంచి సాగనంపడం నిశ్చయమైందని సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్భర్ అన్నారు. ''బీజేపీకి ఉద్వాసన ఖాయమైంది. మార్చి 10వ తేదీ ఉదయం 10 గంటలకు...'మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ్పై, చల్ సన్యాసి మందిర్ మే'' పాటలు ప్లే అవుతాయి'' అని రాజ్భర్ ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో అన్నారు. సమాజ్వాదీ భాగస్వామ్య పార్టీగా ఎస్బీఎస్పీ ఉంది.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉనికి కోసం పోరాడుతోందని, తీవ్రమైన ఫ్రస్టేషన్లో ఆ పార్టీ ఉండటం వల్లే దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక ప్రధాని బీజేపీ కోసం జిల్లాల వారీ పర్యటనలు జరుపుతున్నారని రాజ్భర్ అన్నారు. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి చివరి విడత పోలింగ్ ఈనెల 7న జరుగనుంది. 10న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.