Man Stabbed: రద్దీ రోడ్డుపై అందరూ చూస్తుండగానే హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-08-12T21:41:27+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ హోటల్‌ మేనేజ్‌మెంట్ విద్యార్థిని

Man Stabbed: రద్దీ రోడ్డుపై అందరూ చూస్తుండగానే హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి దారుణ హత్య

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ హోటల్‌ మేనేజ్‌మెంట్ విద్యార్థిని దుండగులు దారుణంగా పొడిచి చంపారు. చుట్టూ వందలాదిమంది ఉన్నా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు సరికదా.. పొడుస్తుంటే చూస్తూ వెళ్లిపోయారు. దక్షిణ ఢిల్లీలోని మాల్వీయ నగర్‌‌లో జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయిది. 25 ఏళ్ల మయాంక్ తన స్నేహితుడితో కలిసి మార్కెట్లో ఉండగా నలుగురైదుగురు వ్యక్తులతో కత్తులతో అతడిని చుట్టుముట్టారు. 


అంతకుముందు మయాంక్ వారితో గొడవ పడినట్టు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది. అనంతరం వారి నుంచి తప్పించుకుంటూ మార్కెట్లోకి వచ్చిన మయాంక్‌ను పట్టుకున్న దుండగులు కత్తులు బయటకు తీశారు. దీంతో వారిని తోసివేసేందుకు మయాంక్ ప్రయత్నించాడు. దీంతో రెచ్చపోయిన నిందితులు కత్తులతో మయాంక్‌ను విచక్షణ రహితంగా పొడిచారు. అక్కడే ఉన్న జనం, దారినపోతున్న వారు, వాహనాలపై వెళ్లేవారు అందరూ ఆ ఘటనను కళ్లప్పగించి చూశారు తప్పితే రక్షించేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు  రాలేదు.

 

తీవ్రంగా గాయపడిన మయాంక్‌ను అతడి స్నేహితుడు స్థానికుల సాయంతో ఎయిమ్స్‌కు తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ మయాంక్ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-08-12T21:41:27+05:30 IST