క్రీడాకారులందరికీ All the best : భారత ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-07-23T22:37:49+05:30 IST

మరి కాసేపట్లో టోక్యో వేదికగా ఒలంపిక్స్ ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులందరికీ

క్రీడాకారులందరికీ All the best :  భారత ప్రభుత్వం

న్యూఢిల్లీ : మరి కాసేపట్లో టోక్యో వేదికగా ఒలంపిక్స్ ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులందరికీ భారత ప్రభుత్వం శుభాకాంక్షలు ప్రకటించింది. కేంద్ర ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ మేరకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రధాని మోదీ తరపున, భారత ప్రభుత్వం తరపున క్రీడాకారులందరికీ ఆల్ ది బెస్ట్. 127 మంది క్రీడాకారులతో అతి పెద్ద భారత బృందం అక్కడి వెళ్లింది. వారందరూ స్వేచ్ఛగా ఆడాలి. అధిక సంఖ్యలో మెడల్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’’ అని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. క్రీడలు ముగిసిన తర్వాత వారందరూ భారత్‌కు తిరిగి రాగానే ప్రధాని మోదీ వారందరితో భేటీ అవుతారని, ఈ విషయాన్ని ప్రధాని మోదీయే స్వయంగా చెప్పారని అనురాగ్ తెలిపారు.  

Updated Date - 2021-07-23T22:37:49+05:30 IST