హన్మకొండ జిల్లాలో ఒమైక్రాన్ కలకలం
ABN , First Publish Date - 2021-12-17T21:48:57+05:30 IST
జిల్లాలో ఒమైక్రాన్ కలకలం రేపుతోంది. ఈనెల 3న యునైటెడ్ కింగ్డమ్ నుంచి మహిళకు ఒమైక్రాన్ నిర్థారణ అయింది.
హన్మకొండ: జిల్లాలో ఒమైక్రాన్ కలకలం రేపుతోంది. ఈనెల 3న యునైటెడ్ కింగ్డమ్ నుంచి మహిళకు ఒమైక్రాన్ నిర్థారణ అయింది. బాధితురాలిని హైదరాబాద్కు తరలించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 9కి ఒమైక్రాన్ కేసులు చేరాయి. గురువారం నమోదైన 4 కేసుల్లో ఒకరి ఆచూకీ లభ్యం కాలేదు. కెన్యా నుంచి వచ్చిన వ్యక్తి(44)గా గుర్తించారు. వ్యక్తి అడ్రస్లో క్లారిటీ లేకపోవడంతో ఆచూకీ దొరకలేదు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో వైద్య సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఒమైక్రాన్ హాట్స్పాట్గా పారమౌంట్ కాలనీ గుర్తించారు. పారమౌంట్ కాలనీని వైద్య సిబ్బంది జల్లడ పడుతోంది. మెడికల్ టూరిజం ద్వారా ఇతన్ని గుర్తించేందుకు అధికారుల ప్రయత్నిస్తున్నారు.