సిరిసిల్ల జిల్లాలో వీడని ఒమైక్రాన్ కలకలం
ABN , First Publish Date - 2021-12-23T01:07:17+05:30 IST
ఒమైక్రాన్ వేరియంట్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను భయపెడుతోంది. రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన రాజన్న
సిరిసిల్ల: ఒమైక్రాన్ వేరియంట్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను భయపెడుతోంది. రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువకుడికి ఒమైక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతనితో ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్న 62 మంది శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపించారు. ఇందులో యువకుడి భార్య, తల్లికి పాజిటివ్గా తేలింది. ప్రైమరీ కాంటాక్ట్ల నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్కు పంపించినట్లు తెలుస్తోంది. యువకుడి కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులను హోంక్వారంటైన్లో ఉండాలని సూచించిన అయితే ఏ వేరియంట్ అన్నది నిర్ధారణ కాలేదని, అందుకు కొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు.