ఒమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో త్వరలో రాష్ట్రానికి కేంద్ర కమిటీ
ABN , First Publish Date - 2021-12-26T16:49:46+05:30 IST
రాష్ట్రంలో కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్ ‘ఒమైక్రాన్’ వ్యాప్తి అధికంగా ఉండటంతో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర పరిశీలక కమిటీ రానుంది. ప్రస్తుతం ఒమైక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్న మహారాష్ట్ర, ఉత్తర ప్రదే
చెన్నై: రాష్ట్రంలో కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్ ‘ఒమైక్రాన్’ వ్యాప్తి అధికంగా ఉండటంతో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర పరిశీలక కమిటీ రానుంది. ప్రస్తుతం ఒమైక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్న మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలలో పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలక కమిటీలను పంపనుంది. ఆ మేరకు త్వరలో రాష్ట్రంలో కేంద్ర కమిటీ పర్యటించి వైరస్ వ్యాప్తిపై స్థానిక ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరుపనుంది.