తెలంగాణలో కొత్తగా 5 ఒమైక్రాన్ కేసులు నమోదు

ABN , First Publish Date - 2022-01-03T01:57:15+05:30 IST

తెలంగాణలో కొత్తగా 5 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 84కి ఒమైక్రాన్ కేసులు చేరాయి.

తెలంగాణలో కొత్తగా 5 ఒమైక్రాన్ కేసులు నమోదు

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 5 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 84కి ఒమైక్రాన్ కేసులు చేరాయి. ఇప్పటివరకు ఒమైక్రాన్ నుంచి కోలుకుని 32మంది రికవరీ అయ్యారు. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 274 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 3,779 యాక్టివ్ కేసులున్నాయి. ఒమైక్రాన్‌, కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 10 వరకు ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సమావేశాలతో పాటు ప్రజలు గుమిగూడే మతపరమైన, రాజకీయ, సాంస్కృతిక సంబంధిత కార్యక్రమాలను నిషేధించింది.

Updated Date - 2022-01-03T01:57:15+05:30 IST