భారత్‌లో 1270కి చేరిన ఒమిక్రాన్ కేసులు

ABN , First Publish Date - 2021-12-31T16:23:22+05:30 IST

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1270కి చేరింది. ఇప్పటివరకూ 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

భారత్‌లో 1270కి చేరిన ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1270కి చేరింది. ఇప్పటివరకూ 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 450, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్ 97, రాజస్థాన్ 69, తెలంగాణ 62, తమిళనాడులో 46, కర్ణాటక 34 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్‌లో ఒమిక్రాన్ నుంచి 374 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Updated Date - 2021-12-31T16:23:22+05:30 IST