ఒమన్లో విజృంభిస్తున్న కరోనా...
ABN , First Publish Date - 2020-05-23T18:27:37+05:30 IST
గల్ఫ్లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది.
ఒమన్: గల్ఫ్లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్ తదితర దేశాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. అటు ఒమన్లో కూడా కోవిడ్-19 చాప కింద నీరులా విస్తరిస్తోంది. శుక్రవారం ఒకేరోజు ఒమన్లో 424 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 6,794కి చేరింది. 1,821 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా, నిన్న సంభవించిన ఒక మరణంతో కలిపి ఇప్పటివరకు ఒమన్లో కరోనా కాటుకు బలైన వారు 32 మంది అయ్యారు. ఇక ఈ మహమ్మారి కట్టడి కోసం ఒమన్ సర్కార్ కఠిన చర్యలు చేపడుతోంది. మసీదులు, మాల్స్, స్కూల్స్, పార్కులను మూసివేసింది. బహిరంగ ప్రదేశాల్లో జన సమూహాలను నిషేధించింది. రంజాన్ మాసంలో కూడా మసీదుల్లో ప్రార్థనలను పూర్తిగా రద్దు చేసింది.