ఒమన్లో విజృంభిస్తున్న మహమ్మారి.. ఒక్కరోజే..!
ABN , First Publish Date - 2020-07-16T07:45:41+05:30 IST
ఒమన్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కాగా.. బుధవారం ఒక్కరోజే ఒమన్లో 1679కరోనా కేసులు నమోదైనట్లు
మస్కట్: ఒమన్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కాగా.. బుధవారం ఒక్కరోజే ఒమన్లో 1679కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్యఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో 1051 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. 8 మంది మహమ్మారికి బలైనట్లు పేర్కొంది. దీంతో ఒమన్లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 61,247కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో దాదాపు 39వేల మంది కరోనాను జయించి, ఇళ్లకు చేరారు. కాగా.. కరోనా కాటుకు మరణించిన వారి సంఖ్య 281 చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.53లక్షల కరోనా కేసులు చేసినట్లు ఒమన్ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.