ఒమన్‌లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు!

ABN , First Publish Date - 2020-07-10T06:44:27+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి ఒమన్‌లోనూ విజృంభిస్తోంది. ఒమన్‌లో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరు

ఒమన్‌లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు!

మస్కట్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి ఒమన్‌లోనూ విజృంభిస్తోంది. ఒమన్‌లో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కాగా.. గురువారం ఒక్కరోజే ఒమన్‌లో 1518కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న కరోనా బారినపడిన వారిలో సుమారు 450 మంది విదేశీయులు ఉన్నట్లు పేర్కొంది. మహమ్మారి కారణంగా గురువారం రోజు ముగ్గురు మృతి చెందినట్లు వైద్యఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా.. ఒమన్‌లో ఇప్పటి వరకు కరోనా బారినపడ్డ వారి సంఖ్య 51.725కు చేరింది. ఇందులో 236 మంది మహమ్మారి కాటుకు ప్రాణాలు కోల్పోయారు. 33వేల మంది కరోనాను జయించి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఒమన్ వ్యాప్తంగా 2.26లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. 


Updated Date - 2020-07-10T06:44:27+05:30 IST