ఒలింపియన్ ధనలక్ష్మి ఇంట విషాదం
ABN , First Publish Date - 2021-08-09T05:24:41+05:30 IST
టోక్యో ఒలింపిక్స్లో భారత్ తరపున బరిలోకి దిగిన క్రీడాకారిని ధనలక్ష్మి శేఖర్ ఇంట విషాదం నెలకొంది. ఒలింపిక్స్లో ధనలక్ష్మి..
టోక్యో ఒలింపిక్స్లో భారత్ తరపున బరిలోకి దిగిన క్రీడాకారిని ధనలక్ష్మి శేఖర్ ఇంట విషాదం నెలకొంది. ఒలింపిక్స్లో ధనలక్ష్మి 4x400 మీటర్ల మిక్స్డ్ రిలేలో పాల్గొంది. పోటీలు ముగియడంతో ఆదివారం ఆమె తమిళనాడులోని తిరుచిరప్పల్లికి తిరిగివచ్చింది. అయితే ఇంటికి రాగానే తన సోదరి మరణవార్త విని భోరుమంది. రోడ్డుపైనే కూర్చుని కన్నీరు పెట్టుకుంది.
కాగా.. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొంనేందుకు ధనలక్ష్మి కూడా జర్మనీలో కోచింగ్ తీసుకుంది. అయితే ధనలక్ష్మి జర్మనీలో ఉన్న సమయంలోనే ఆమె సోదరి అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ధనలక్ష్మికి చెప్పకూడదని ఆమె తల్లి నిర్ణయించుకుంది. దీంతో ధనలక్ష్మికి ఈ విషయం తెలియదు. అయితే తాజాగా తిరిగివచ్చిన సమయంలో అక్క చనిపోయిన విషయం తెలియగానే ధనలక్ష్మి షాక్ తిన్నది.