మాస్టర్‌ ప్లాన్‌కు పాతర

ABN , First Publish Date - 2020-07-06T11:51:33+05:30 IST

తాడేపల్లిగూడెంలో మాస్టర్‌ ప్లాన్‌ రహదారులకు తూట్లు పొడుస్తూ ఇళ్ల పట్టాలు ఇవ్వడమేమిటని ..

మాస్టర్‌ ప్లాన్‌కు పాతర

తాడేపల్లిగూడెం, జూలై 5(ఆంధ్రజ్యోతి) : తాడేపల్లిగూడెంలో మాస్టర్‌ ప్లాన్‌ రహదారులకు తూట్లు పొడుస్తూ ఇళ్ల పట్టాలు ఇవ్వడమేమిటని  తెలుగుదేశం నాయకుడు వలవల బాబ్జి ప్రశ్నించారు.ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. మాస్టర్‌ ప్లాన్‌లో  గణేశ్‌ నగర్‌ నుంచి నిట్‌కు వెళ్లే రహదారి 100 అడుగులుగా ఉండగా 40 అడుగులకు కుదించి పట్టాలిస్తే అభివృద్ధి ఆగి పోతుందన్నారు.అప్పారావు పేట వెళ్లే రహదారి రోడ్డు మార్జిన్లలో పట్టాలివ్వ డాన్ని తప్పుబట్టారు. రోడ్ల పక్కన కాకుండా భూసేకరణ చేయాలని డిమాండ్‌ చేశారు.నియోజకవర్గ అభివృద్ధి పనుల్లోనూ నాణ్యత లోపించిందన్నారు. 

Updated Date - 2020-07-06T11:51:33+05:30 IST