పింఛన్‌ కోసం వస్తూ అనంతలోకాలకు..

ABN , First Publish Date - 2021-03-02T05:51:55+05:30 IST

తెలికిచర్ల గ్రామానికి చెందిన బొడిగిన కనకమ్మ (80) నల్లజర్లలో తన కుమార్తె వద్ద ఉంటోంది.

పింఛన్‌ కోసం  వస్తూ అనంతలోకాలకు..

నల్లజర్ల, మార్చి  1: తెలికిచర్ల గ్రామానికి చెందిన బొడిగిన కనకమ్మ (80) నల్లజర్లలో తన కుమార్తె వద్ద ఉంటోంది. 1వ తేదీ కావడంతో  పింఛన్‌ తీసుకునేందుకు స్వగ్రామం తెలికిచర్ల  మనవడు శ్రీనివాస్‌  బైక్‌ పై బయలుదేరింది. అనంతపల్లి బైపాస్‌ రోడ్డులో హైస్కూల్‌ వద్ద వీరి బైక్‌ను వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఈమెకు తీవ్ర గాయాలయ్యాయి. 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కనకమ్మ మృతి చెందింది.  శ్రీనివాస్‌ తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


Updated Date - 2021-03-02T05:51:55+05:30 IST