లారీ ఢీకొని వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2022-07-03T04:42:33+05:30 IST

స్థానిక రైల్వే గేట్‌ వద్ద శనివారం ఉదయం లారీ ఢీకొని వీరమ్మ (65) మృతి చెందింది.

లారీ ఢీకొని వృద్ధురాలి మృతి

కమలాపురం రూరల్‌, జూలై 2: స్థానిక రైల్వే గేట్‌ వద్ద శనివారం ఉదయం లారీ ఢీకొని వీరమ్మ (65) మృతి చెందింది. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వడ్డెర కాలనీ వాసి వీరమ్మ రైల్వే గేటు వద్ద రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యు లు పరిశీలించి మృతిచెందినట్లు ధృవీకరించారు.  పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-07-03T04:42:33+05:30 IST