వృద్ధుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-13T06:11:14+05:30 IST

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడు జీవితంపై విరక్తితో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని యాగర్లపల్లిలో చోటుచేసుకుంది.

వృద్ధుడి ఆత్మహత్య

తాడేపల్లిగూడెం రూరల్‌, మే 12: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడు జీవితంపై విరక్తితో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని యాగర్లపల్లిలో చోటుచేసుకుంది. దీనికి సంబందించి  పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాగర్లపల్లికి చెందిన ఎస్‌. గౌరయ్య (57) ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల చూస్తున్న కరోనా మరణాల నేపథ్యంలో మానసికంగా మరింత కుంగి  బుధవారం తెల్లవారు జామున ఇంటి ముందున్న వేపచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ జీజే ప్రసాద్‌ తెలిపారు. 


Updated Date - 2021-05-13T06:11:14+05:30 IST