రెండేళ్ల క్రితం పెళ్లిలో గొడవ.. అది మనసులో పెట్టుకుని ఆ స్నేహితులు ఎంతకు తెగించారంటే..

ABN , First Publish Date - 2022-03-07T05:43:15+05:30 IST

వారు ముగ్గురూ స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. రెండేళ క్రితం వారంతా కలిసి ఓ పెళ్లికి వెళ్లారు.. ఆ పెళ్లిలో స్నేహితుల మధ్య చిన్న గొడవ జరిగింది. ఒక యువకుడు మిగతా ఇద్దరితో గొడవ పడ్డాడు.. తర్వాత మళ్లీ ముగ్గురూ కలిసిపోయారు...

రెండేళ్ల క్రితం పెళ్లిలో గొడవ.. అది మనసులో పెట్టుకుని ఆ స్నేహితులు ఎంతకు తెగించారంటే..

వారు ముగ్గురూ స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. రెండేళ క్రితం వారంతా కలిసి ఓ పెళ్లికి వెళ్లారు.. ఆ పెళ్లిలో స్నేహితుల మధ్య చిన్న గొడవ జరిగింది. ఒక యువకుడు మిగతా ఇద్దరితో గొడవ పడ్డాడు.. తర్వాత మళ్లీ ముగ్గురూ కలిసిపోయారు. అయినా ఆ గొడవను మనసులో పెట్టుకున్న ఇద్దరు స్నేహితులు తాజాగా ఆ యువకుడిని చంపేశారు. పోలీసుల ఎదుట డ్రామా ఆడారు. అయితే మొబైల్ ఫోన్ల ఆధారంగా దొరికిపోయారు. 


ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మోదీనగర్‌కు చెందిన వివేక్, మోహిత్, నిక్కీ అనే యువకులు చిన్నప్పటి నుంచి స్నేహితులు. రెండేళ్ల క్రితం ఓ పెళ్లిలో వివేక్‌తో మోహిత్, నిక్కీ గొడవ పడ్డారు. ఆ తర్వాత కొంత కాలానికి తిరిగి కలిసిపోయారు. అయితే ఆ గొడవను మోహిత్, నిక్కీ మర్చిపోలేదు. సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. గత నెల 6వ తేదీన ముగ్గురూ కలిసి గ్రామ శివార్లలో మందు కొట్టారు. ఆ మత్తులో వివేక్‌ను ఇద్దరూ కలిసి హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశారు. 


ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు స్నేహితుడి మృతదేహం వద్దకు వెళ్లి విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. స్నేహితులు కాబట్టి మోహిత్, నిక్కీని విచారణకు పిలిచారు. వారు తమకేమీ తెలియదని చెప్పారు. అయితే హత్య జరిగిన సమయంలో వారి మొబైల్ లొకేషన్‌ను పరిశీలించగా ముగ్గురివీ ఒకే చోట ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కఠినంగా విచారణ చేశారు. దాంతో వారు తామే హత్య చేసినట్టు పోలీసుల ఎదుట అంగీకరించారు. 


Updated Date - 2022-03-07T05:43:15+05:30 IST