కరోనాపై పోరుకు ఓలా 8కోట్ల విరాళం

ABN , First Publish Date - 2020-04-11T04:34:30+05:30 IST

కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రముఖ కార్ రెంటల్ సంస్థ ఓలా చేయూత నిచ్చింది.

కరోనాపై పోరుకు ఓలా 8కోట్ల విరాళం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రముఖ కార్ రెంటల్ సంస్థ ఓలా చేయూత నిచ్చింది. ప్రధానమంత్రి సహాయనిధికి రూ.5కోట్ల విరాళం అందించింది. ఈ మొత్తాన్ని పీఎం కేర్స్‌ నిధికి అందజేసినట్లు సమాచారం. ఇంతేగాక వివిధ రాష్ట్ర ప్రభుత్వా లు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధులకు మరో రూ.3కోట్ల రూపాయలను ఓలా అందించింది. అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో రిక్షావాలాలను ఆదుకోవడం కోసం ఇదివరకే ‘డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్’ను ఏర్పాటు చేసింది.

Updated Date - 2020-04-11T04:34:30+05:30 IST