ఓక్లహోమాలో దారుణం: మహిళను చంపి.. ఆమె గుండెను ఏం చేశాడంటే..!

ABN , First Publish Date - 2021-02-24T23:26:24+05:30 IST

అమెరికాలోని ఓక్లహోమాలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన పొరుగింటిలో ఒంటరిగా ఉండే మహిళను చంపి.. ఆమె శరీరం నుంచి గుండెను పెకలించి తన కుటుంబ సభ్యులకు వండిపెట్టాడు.

ఓక్లహోమాలో దారుణం: మహిళను చంపి.. ఆమె గుండెను ఏం చేశాడంటే..!

ఓక్లహోమా: అమెరికాలోని ఓక్లహోమాలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన పొరుగింటిలో ఒంటరిగా ఉండే మహిళను చంపి.. ఆమె శరీరం నుంచి గుండెను పెకలించి తన కుటుంబ సభ్యులకు వండిపెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. మిన్నెసోటాలో నివాసముండే లారెన్స్ పాల్ అండర్సన్‌ను ఓక్లహోమాలో జరిగిన ఇద్దరి దారుణ హత్య ఘటనలో అనుమానితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ కేసును ఓక్లహోమా స్టేట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఓఎస్‌బీఐ) అధికారులకు అప్పగించారు. ఓఎస్‌బీఐ విచారణ సమయంలోనే లారెన్స్ విస్తుపోయే విషయాలు చెప్పాడు.


ఆ ఇద్దరిని చంపింది తాను కాదని చెప్పిన లారెన్స్.. తన పొరుగింటి మహిళ ఆండ్రియా లిన్ బ్లాంకెన్‌షిప్(41)ను హత్య చేసింది మాత్రం తానేనని ఒప్పుకున్నాడు. ఆండ్రియాను చంపిన తర్వాత ఆమె గుండెను తన కుటుంబ సభ్యులకు వండిపెట్టానని చెప్పాడు. ఇక ఇదే ఓక్లహోమాలోనే దారుణహత్యకు గురైన లియోన్ పై(67), అతని 4 సంవత్సరాల మనవరాలు కయోస్ యేట్స్ విషయమై ప్రస్తుతం లారెన్స్‌ను అధికారులు విచారిస్తున్నారు. లియోన్ పై నివాసం నుంచి ఈ నెల 9న 911కు వచ్చిన ఫోన్‌కాల్ వల్లే ఈ దారుణం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ మిస్ట్రీ మర్డర్స్‌పై విచారణ కొనసాగుతోంది.   



Updated Date - 2021-02-24T23:26:24+05:30 IST