మా రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెడితే.. ఎలన్ మస్క్‌కు బంపరాఫర్

ABN , First Publish Date - 2020-05-19T22:27:31+05:30 IST

ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్‌కు అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రం బంపరాఫర్ ఇచ్చింది.

మా రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెడితే.. ఎలన్ మస్క్‌కు బంపరాఫర్

ఓక్లహామా: ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్‌కు అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రం బంపరాఫర్ ఇచ్చింది. కాలిఫోర్నియా ప్రభుత్వ విధానాలతో చిర్రెత్తిన మస్క్.. ఇదే పరిస్థితి కొనసాగితే తన ప్రధాన కార్యాలయాన్ని వేరే రాష్ట్రానికి తరలిస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి మస్క్‌కు ఆఫర్లు అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఓక్లహామా రాష్ట్రం ఓ బంపరాఫర్ ప్రకటించింది. మస్క్ గనక తన టెస్లా కంపెనీ గిగాఫ్యాక్టరీని తమ రాష్ట్రంలో పెడితే.. ఆ కంపెనీ తయారు చేసే సైబర్‌ట్రక్కులనే పోలీసు శాఖ ఉపయోగిస్తుందని తెలిపింది. ఈ మేరకు ఓక్లహామా మేయర్ జీటీ బైనమ్ ఓ ట్వీట్ చేశారు.


‘ప్రపంచాన్ని మార్చడానికి టెస్లా, టుల్సా(ఓక్లహామాలో ఓ నగరం) చేతులు కలిపితే, ఇలా చేయడమే సరైన పని’ అంటూ పోలీసు వాహనంలా గ్రాఫిక్స్ చేసిన సైబర్‌ట్రక్‌ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫ్యాక్టరీని టెక్సాస్‌లో పెట్టాలని టెస్లా కంపెనీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఓక్లహామా మేయర్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం.



Updated Date - 2020-05-19T22:27:31+05:30 IST