ముగ్గురిని పోగొట్టుకున్నా.. భౌతిక దూరం పాటించండి.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-04-02T23:53:19+05:30 IST

ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ ఒహాయోకు చెందిన కెల్లీ అనే మహిళ విజ్ఞప్తి చేస్తోంది. కరోనా బారిన పడి వారం రోజుల వ్యవధిలో తన కుటుంబంలో

ముగ్గురిని పోగొట్టుకున్నా.. భౌతిక దూరం పాటించండి.. అమెరికాలో..

గ్రోవ్ సిటీ, ఒహాయో: ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ ఒహాయోకు చెందిన కెల్లీ అనే మహిళ విజ్ఞప్తి చేస్తోంది. కరోనా బారిన పడి వారం రోజుల వ్యవధిలో తన కుటుంబంలో ముగ్గురు చనిపోయారని, ఈ పరిస్థితి ఎవరికి రాకూడదని కెల్లీ కోరుకుంటోంది. ఒహాయోలోని గ్రోవ్ సిటీకి చెందిన కెల్లీ.. తన తల్లి, తండ్రి, సోదరుడిని కోల్పోయింది. ప్రస్తుతం తన భర్త కూడా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నట్టు పేర్కొంది. తన సోదరుడు అనారోగ్యంతో ఉన్న తల్లిని చూడటానికి వచ్చి కరోనా బారిన పడినట్టు కెల్లీ చెప్పింది. ఇంటికి వచ్చిన మరుసటి రోజే తన సోదరుడికి కరోనా లక్షణాలు రావడం మొదలయ్యాయని.. వెంటనే పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ తేలినట్టు తెలిసిందని పేర్కొంది. కాగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన తన సోదరుడు గత ఆదివారం మరణించాడని కెల్లీ ఆవేదనను వెల్లగక్కింది. ప్రస్తుతం తాను సెల్ప్ ఐసోలేషన్‌లోనే ఉన్నానని.. ఇంటి నుంచే తన భర్త కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెబుతోంది. కాగా.. అమెరికాను కరోనా మహమ్మారి ఏ విధంగా కబళిస్తోందో చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. అయినప్పటికి అమెరికాలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలను అమలు చేయడం లేదు. దీంతో ఏ నిమిషాన ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-04-02T23:53:19+05:30 IST